Sunday, December 26, 2010

కలిసిరాని కాలం

kalam
కలిసిరాని కాలం
కాలం విచిత్రమైంది. ఒక్కోసమయంలో కొందరికి కలిసి వస్తుంది. మరికొందరికి అదే కాలంలో కష్టాలు, నష్టాలు తప్పవు. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారైనా సమస్యల్లో ఇరుక్కుంటారు. వారి ప్రభ మసకబారుతుంది. ఒక్కో ఏడాది ఒక్కోరికి ఒక్కో రకంగా గడుస్తుంది. ఒకప్పుడు రాజకీయాలను శాసించిన వారు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మాట పడాల్సి వస్తుంది. పలుకుబడి తగ్గుతుంది. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా వారి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ ఏడాది అలాంటి వారి జాబితాలో లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవి, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, శశిథరూర్‌, కనిమొళి, ఎ రాజా మొదలైన వారున్నారు.

కేంద్రంలో పదవి పోయింది రాష్ట్రంలో రాను పొమ్మంది
lalu1తన వ్యవహారశైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండే నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఆయన పదవిలో ఉన్నా, లేకున్నా ప్రచారంలో మాత్రం ఉంటారు. లోక్‌నాయక్‌ జయ ప్రకాశ్‌ నారాయణ్‌ శిష్యుడైన లాలూ ఒకప్పుడు బీహార్‌ రాజకీయాల్ని శాసించారు. తన 29వ ఏటనే, అంటే 1977లో జనతా పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఘనత ఆయనది. అప్పట్లో జనతాదళ్‌ ఎంపీల్లో లాలూనే పిన్న వయస్కుడు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా, బీహార్‌ ముఖ్య మంత్రిగా చక్రం తిప్పారు. దానికన్నా ఎక్కువగా ఆయనకు దాణా కుంభకోణంతో బాగా ప్రచారం వచ్చింది. జనతాదళ్‌ను వీడి, 1997లో రాష్ట్రీయ జనతాదళ్‌ను (ఆర్‌జెడి)ని స్థాపించిన లాలూప్రసాద్‌ యూపీఏ మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు కీలకపాత్ర పోషించారు. తర్వాత కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టున్నారు. ఈ ఏడాది లాలూకు కష్టకాల మేననాలి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ బాబును, ఆయన పార్టీని బాగా దెబ్బతీశాయి. ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌కు గట్టి పోటీ నిచ్చారు. కానీ చివరికి భంగపడక తప్పలేదు. ఇందుకు లాలూ స్వయంకృతాపరాధం కూడా ఉంది. బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారన్న భావన ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఆ మచ్చను లాలూ తుడిచేసు కోలేకపోయారు. అందుకే లాలూ ఈ ఏడాది వార్తల్లో ఉన్నా, విజయాల్లో మాత్రం లేరు.
పతిదేవుని అడుగుజాడల్లో..
laluఈమె లాలూప్రసాద్‌ యాదవ్‌ సతీమణి. ఆ విధంగానే ఈమెకు గుర్తింపు వచ్చింది తప్ప రాజకీయ నాయకురాలిగా కాదు. దాదాపు నిరక్షరాస్యురాలైన రబ్రీదేవి గతంలో బీహార్‌ ముఖ్యమంత్రి కావడంపై అనేక విమర్శలు వచ్చా యి. ఆమె సాధారణ గృహిణే తప్ప రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి. మూడు సార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా చేసినా రబ్రీదేవికి నాయకురాలిగా పేరు లేదు. పైగా, ఏమీ తెలీని వ్యక్తిని సిఎం సీట్లో కూచోబెట్టడం వల్లనే బీహార్‌ అధోగతి పాలైందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన బీహార్‌ ఎన్నికల్లో రబ్రీదేవి ప్రభావం ఉండవచ్చని భావించారు. ప్రచారంలో ఆమె విస్తృతంగా పాల్గొన్నారు కూడా. అయితే, జనం ఆమెను పట్టించుకోలేదు. ఆర్‌జెడి గెలిస్తే ఆమె మళ్లీ బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ కాలం కరుణించలేదు. రబ్రీని, లాలూను ప్రజలు తిరస్కరించారు.
మిత్రధర్మం మట్టి కరిపించింది
Ram-Paswanలోక్‌జనశక్తి పార్టీ అధినేత పాశ్వాన్‌. లాలూకు, పాశ్వాన్‌కు రాజకీయంగా పోలిక ఉంది. ఆయన మాదిరే ఈయన కూడా 1977లోనే లోక్‌సభకు జన తాపార్టీ తరఫున తొలిసారి ఎన్నికయ్యారు. లాలూ మాదిరే పాశ్వాన్‌ కూడా జనతా పార్టీ నుంచి విడిపోయి, సొంతపార్టీ లోక్‌జనశక్తి స్థాపించారు. ఆయ న లాగే రైల్వే మంత్రిగా పనిచేశారు. రెండు భిన్న ధ్రువాలుగా ఉన్న అధికార కూటముల్లో మంత్రిగా ఉన్న ఘనత పాశ్వాన్‌ది. ఎన్‌డిఏ హయాం్‌ లో పాశ్వాన్‌ హవా నడిచింది. అప్పట్లో రైల్వే మంత్రిగా, తర్వాత బొగ్గుశాఖా మంత్రిగా ఉన్నారు. యూపీఏలో కూడా మంత్రిగా ఉన్న పాశ్వా న్‌ అప్పట్లో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూతో జత కట్టిన పాశ్వాన్‌ ఆయన మాదిరే భంగపాటుకు గురయ్యారు. కొన్నేళ్ల పాటు దళిత కార్డుతో ప్రముఖంగా వెలిగిన పాశ్వాన్‌కు ఈ ఏడాది కలిసిరాలేదు.
పువ్వు పుట్టగానే..
kanimoliఈమె తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎం కరుణానిధి కుమార్తె. రాజ్యసభ సభ్యురాలు. డిఎంకె నాయకురాలు. 2జి కుంభకోణంలో చిక్కుకొన్న కేంద్ర మాజీ మంత్రి ఎ రాజాను మొదటి నుంచీ సమర్థిస్తూనే ఉన్నారు. కుంభకోణంలో ఈమె పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.2జి మేఘాలు ఈమెను కూడా కమ్మాయి. చెనై్నలో కనిమొళికి చెందిన ఒక సంస్థలో కూడా సిబిఐ సోదా జరిపింది.
ఖేల్‌ ఖతం... పైసా హజం !
Suresh-Kalmadiకామన్వెల్త్‌ క్రీడోత్సవాల్లో ప్రాజెక్టుల కేటాయింపులు, వాటి వ్యయం పెంపుపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాటికి కేంద్రబిందువు నిర్వహణా కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన సురేష్‌ కల్మాడీ. క్రీడోత్సవాల ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచడంపట్ల సురేష్‌కల్మాడీ అనేక తీవ్ర ఆరోపణలకు గురయ్యారు. సురేశ్‌ కల్మాడీకి ప్రధాని స్వయంగా అడ్వాన్సులు మంజూరు చేశారని బీజేపీ ఆరోపించింది మీకు, మీ మంత్రివర్గానికీ బాధ్యత లేదా?’ అని గడ్కారీ సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు హఠాత్తుగా పెరగడంపై ఆ పార్టీ కల్మాడీని, ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. క్రీడోత్సవాలకోసం కేటాయించిన 70 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రతిపక్షం నిలదీసింది. కల్మాడీ ఏం చేశారో కాంగ్రెస్‌లో అందరికీ తెలుసు. ఆయన సలహా పైనే ప్రధాని అడ్వాన్సులు విడుదల చేశారని, కల్మాడీకి ప్రధాని విడుదల చేసిన మొదటి అడ్వాన్స్‌పై ఆయన సంతకముందనీ ధ్వజమెత్తింది. కల్మాడీపై వస్తున్న విమర్శలకు తట్టుకోలేక కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. రెండ్రోజుల కింట సిబిఐ కల్మాడీ నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిపింది. తనే తప్పూ చేయలేదని, అయినా సిబిఐ దర్యాప్తుకు సహకరిస్తానని సురేష్‌ కల్మాడీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నత వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ కల్మాడీకి ఈ ఏడాది కలిసి రాలేదు. ఆరోపణలు, దర్యాప్తులతో గడిచింది.
2జి బకాసురుడా ?
rajaదేశాన్ని, పార్లమెంటును కుదిపేసిన 2జి కుంభ కోణంలో డిఎంకె నాయ కుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. విమర్శల తుపానును ఎదు ర్కొనేందుకు కేంద్ర ప్రభు త్వం ఎంతో అవస్థ పడు తోంది. రాజా ప్రయేయం ఉన్నట్టు అనుకొంటున్న 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంవల్ల పార్లమెంటు శీతాకాల సమవేశాలు స్తంభించిపోయాయి. మాజీ మంత్రి ఎ రాజాకు డిఎంకె పార్టీ అండదండలు మెండుగా ఉన్నాయి. అయినా ప్రతిపక్షాల విమర్శల ధాటికి తట్టుకోలేక రాజీనామా చేయవలసిందిగా కేంద్రప్రభుత్వం ఎ రాజాను ఆదేశించింది. రాజా, ఆయనకు సంబంధించిన వారి నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు జరిపింది. 2జి కుంభకోణంతో రాజా పరువుకు భారీగానే నష్టం వాటిల్లింది.
పుష్కర ప్రేమలో.. శశి గ్రహణం
STHARORకేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌పై విదేశీ ముద్ర ఎక్కువగా ఉంది. ఐక్యరాజ్య సమితిలో సుదీర్ఘకాలం పనిచేసిన శశిథ రూర్‌కు రాజకీయాల్లో అనుభవం తక్కువ. తిరువనంతపురం నుంచి లోక్‌సభ ఎన్నికై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవి ని నిర్వహించిన థరూర్‌ పదవిని చేపట్టి నప్పటి నుంచీ... తన వ్యాఖ్యలతో అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 1956లో లండన్‌లో పుట్టిన శశి జీవితం చాలావరకు విదేశాల్లోనే గడిచింది. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కీలక బాధ్యతలు నిర్వహించి, పరిపాలనా వ్యవహారాల్లో సమర్థుడనిపించుకున్నారు. కానీ రాజకీయ రంగంలో రాణించలేకపోయారు. ఆయన మంచి రచయిత, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వక్త, మానవహక్కుల కార్యకర్త. ఎన్నో అవార్డులు అందుకొన్నారు. అయితే, ఈ ఏడాది ఆయన జీవితం ఆరోపణలు, విమర్శలతోనే గడిచింది. ఐపిఎల్‌ క్రికెట్‌ జట్ల ఎంపిక విషయంలో ఆయన కొందరికి సాయం చేశారనే విమర్శలు రావడం, వాటిని ఖండించడం జరిగింది. కానీ, విమర్శల తీవ్రత ఎక్కువ కావడంతో శశిథరూర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

No comments:

Post a Comment